◆బిఆరెస్ బడ్జెట్లన్నీ డూప్లికేట్ బడ్జెట్లే.
◆సకలజనుల సంక్షేమానికి అద్దం పట్టిన ప్రస్తుత బడ్జెట్.
◆పదేళ్ల విధ్వంస పునాదులపై మొదలైన తెలంగాణ పునర్నిర్మాణం.
◆ఏ బడ్జెట్లో అయినా బాగుపడ్డది కేసీఆర్ కుటుంబమే.
◆కేసీఆర్ అండ్ టీం ఆస్తులపై సీబీఐతో విచారణ జరిపించాలి.
◆అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తున్న కాంగ్రెస్.
వైద్య రంగం, వ్యవసాయ రంగానికి సైతం అధిక నిధులు కేటాయించారన్నారు. గడపగడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నారు. బీఆరెస్ చేసిన ఎనభై వేల కోట్ల కరెంట్ అప్పులు వున్నా ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం నిధులు వెచ్చించడం కేసీఆర్ అండ్ టీమ్ కు చెంపదెబ్బ లాంటిదని అభివర్ణించారు. గతప్రభుత్వం ఊరికి ఒకరిద్దరు దళితబంధు, బీసీ బంధు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. యువనేత మానుకోట ఎమ్మెల్యే డా.బీ. మురళీ నాయక్ నియోజకవర్గంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేలా వారి ఎదుగుదలలో ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. అన్ని మౌళికవసతుల కల్పనకు కసరత్తు చేస్తున్నారన్నారు. ఏదేమైనా రాష్ట్రాన్ని మద్యం డబ్బులతో, అవినీతితో నడిపిన బీఆరెస్ పార్టీకి ముందుముందు అసలు సిసలు సిన్మా కనిపిస్తుందని అన్నారు. వచ్చే పట్టభద్రుల, పార్లమెంట్ ఎన్నికల్లో లేని తమ ఉనికిని చాటుకునేందుకు బీఆరెస్ పార్టీ ప్రజల్ని బురిడీ కొట్టించే కుట్రలకు పాల్పడుతోందని అన్నారు.
కేసిఆర్ బ్యాచ్ ఆస్తులపై సీబీఐతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా బీఆరెస్ నేతలు, బానిసలు నోర్లు అదుపులో పెట్టుకోవాలని, ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే అడ్డమైన పనికిమాలిన పనులు మానుకోవాలని హితబోధ చేశారు. లేదు ఇలాగే తప్పుడు మాటలు మాట్లాడుతాం అంటే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని బీఆరెస్ నేతలుకు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఇంకా ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామిశెట్టి ఉప్పలయ్య, యువ నాయకులు ఆల్వాల లాలయ్య, షఫీ, వినోద్, విజయ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

