నమస్తే మానుకోట
జిల్లాలో 59 మద్యం షాప్ లకు గాను ఏబీ ఫంక్షన్ హాల్ లో లాటరీ ప్రక్రియ ద్వారా జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొని ప్రొహిబిషన్ , ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించి కేటాయింపులు జరిపారు.
ముందుగా షాపుల వారీగా దరఖాస్తులు పరిశీలిస్తూ ఎక్సైజ్ శాఖ వారి పద్దతిలో ప్రత్యక్షంగా దరఖాస్తు దారుల ఎదురుగానే లాటరీ విధానంలో ఎంపిక చేసి ప్రకటించారు. ఈ విధంగా 1 నుండి క్రమ పద్ధతిలో 59 షాపులకు లాటరీ ద్వారా దరఖాస్తు దారులను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పర్యవేక్షకులు కిరణ్ కుమార్, డి.ఎస్.పి.సత్యనారాయణ, పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.