Type Here to Get Search Results !

శబరిమలలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్..

తెలంగాణ రాష్ట్రంలో  సీఎం కేసీఆర్  నాయకత్వంలో రాష్ట్రం  అభివృద్ధి లో మరింతగా ముందుకు సాగాలని సీఎం కేసీఆర్  పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్  అన్నారు.ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేసి అయ్యప్పను వేడుకున్నట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామి సన్నిధిలో ప్రత్యేక పడిపూజ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు.
 మూడోసారి సీఎం కేసీఆర్  తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని, మానుకోట నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఎల్లవేళలా వారికి అయ్యప్పస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఈ పర్యటనలో ఎమ్మెల్యే కుమారుడు సూర్యచంద్ర, మున్సిపల్ చైర్మన్ డా, రామ్మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర గురు స్వామి,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.