మంచినీటి బావులను శుభ్రంగా ఉంచుకోవాలి.
కాంగ్రెస్ యువనేత నూకల అభినవరెడ్డి.
డోర్నకల్/మరిపెడ,జూన్ 16(నమస్తే న్యూస్).గ్రామంలోని మంచినీటి బావులను శుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలని కాంగ్రెస్ పార్టీ యువ నేత నూకల అభినవరెడ్డి అన్నారు.మంగళవారం మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామంలో మంచినీటి బావి మరమ్మతుల పనులను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,రానున్న వర్షాకాలం సీజన్లో తాగునీరు ఎలాంటి కలుషితం కాకుండా స్థానిక సర్పంచ్,గ్రామపంచాయతీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెన్నెల నాగరాజు,ఉప సర్పంచ్ దేశెట్టి శ్రీనివాస్,పటేల్ దుర్గయ్య,రాజీల్క శ్రీనివాస్ చారి,మల్యాల శ్యాం,దండగల వెంకన్న,వంగూరి వెంకన్న,రాజీల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

