Type Here to Get Search Results !

బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి.

బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి






రిపోర్టర్. సాయిరెడ్డి (8977289630)
సెంటర్.సూర్యాపేట.

సూర్యాపేట,మే 28 (నమస్తే న్యూస్)

బక్రీద్ త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ అని,పండుగలు సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తాయని,మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి పేర్కొన్నారు.బక్రీద్ పండుగ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలోని 42వ వార్డులో కాంగ్రెస్ నాయకులు షేక్ పర్వేజ్ నివాసంలో నిర్వహించిన వేడుకలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవించడం సమాజానికి మంచిదని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఏలుగురి ఇందిరా వీరయ్య గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు బైరు నాగరాజు, బాలెంల మాజీ సర్పంచ్ రామసాని రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడకండ్ల ఉపేందర్, పందిరి మల్లేష్ గౌడ్, గార్లపాటి వెంకట్ రెడ్డి, వెన్న ఉపేందర్, నంద్యాల భిక్షం రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, జంగిలి సైదులు, నంద్యాల నరేష్ రెడ్డి, ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ అధ్యక్షుడు బంధం విష్ణు నాని, పట్టణ కాంగ్రెస్ నాయకులు కోడి కిరణ్, తలారి రాజేష్, పిల్లల నాగరాజు, గుండగాని మహేష్, మధు, నూకల మనోజ్, లింగ, స్వాత్విక్, వినయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.