శ్రీఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం
నర్సింహులపేట,మే26(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పిచ్చిరాం తండాకు వెళ్లే మార్గంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి స్థానిక భక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణంలో ఉపయోగించే గ్రానైట్ కొనుగోలుకు ఆకుతోట నారాయణ, ఆకుతోట సంపత్, తోట సురేష్, రేఖ నర్సయ్యలు కలిసి రూ.24 వేల నగదును ఆలయ సంరక్షకులు అలవాల రవికి అందజేశారు.ఈ సందర్భంగా దాతల సేవాభావాన్ని ఆలయ కమిటీ సభ్యులు అభినందిస్తూ,ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

