నమస్తే న్యూస్ నర్సింహులపేట
అధ్యక్ష కార్యదర్శులు డొనికెన రామన్న, చిర్ర సతీష్మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో కల్లు గీత కార్మిక సంఘం ఐదో మండల మహాసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యమగాని వెంకన్న, గౌని వెంకన్న హైజరై వీరి ఆధ్వర్యంలో మండల కల్లుగీత కార్మిక సంఘ నూతన కమిటీని ఏకగ్రీవం చేశారు
అధ్యక్షులు:- డొనికెని రామన్న
ప్రధాన కార్యదర్శి:- చిర్ర సతీష్
ఉపాధ్యాక్షులు:- గుండగాని వెంకన్న
కోశాధికారి:- దొంతు రాంముర్తి
సహాయక కార్యదర్శి:-చలమల్ల వెంకన్న
గౌరవ అధ్యక్షురాలు:- చలమల్ల యాదగిరి
సోషల్ మీడియా కన్వీనర్:-కోల యాకయ్య
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి
గౌని వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ప్రతి సొసైటీకి 5 ఎకరాలు భూమి ఇవ్వాలని, పెండింగ్ ఎక్ర్స్గేషియ విడుదల చేయాలని, గీతా వృత్తి రక్షణ కోసం 500 కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటు చేసి గీతా వృత్తి చేసే ప్రతి కార్మికునికి మోటార్ బైక్, 50 ఏండ్లు నిండిన కార్మికులకు పెంచన్, గీతా కార్మికులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా నూతన కల్లుగీత కార్మిక సంఘ అధ్యక్షుడు డొనికెన రామన్న మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపుతు, కల్లుగీత కార్మిక సంఘం హక్కుల సాధన కోసం పోరాడతానని గీతా కార్మికుల ఐక్యత కోసం కృషి చేస్తానని తెలిపారు
ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారు గునిగంటి మోహన,గౌడ కుల అధ్యక్షులు డొనికెన జంపన్న, సీతారాములు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు


