నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
శభాష్..మానుకోట పోలీస్..
ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ సామాజిక రుగ్మతలను రూపు మాపడమే కాకా,
మానవీయ కోణాన్ని ఆవిష్కరించడంలో మాకు మేమే సాటి అని నిరూపిస్తున్నారు మానుకోట జిల్లా పోలీసులు...
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రామ్ నాద్ కేకూన్ తన మార్కు చూపిస్తూ జిల్లాలో గుడుంబా,నల్ల బెల్లం,గంజాయి సాగు రవాణాపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ..
జిల్లా లో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ ప్రమాదాల బారిన పడి అమాయక కుటుంబాలు రోడ్డున పడటం తో చలించిన ఎస్పీ రోడ్ల మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటునే,
దీన స్థితి లో వున్నా రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి, అటవీ ప్రాంత యువకులు కి వాలీ బాల్, క్రికెట్ కిట్స్ అందివ్వడం లాంటి సామజిక కార్యక్రమాలు చేస్తు కమ్యూనిటీ పోలీసింగ్ చేస్తూ ద్వారా ప్రజలకు మరింత చేరువవుతూ మానవీయతను చాటుకుంటున్నారు,.
అసాంఘిక కార్యకలపాల పై దృష్టిని కేంద్రీకరించే పోలీస్ బాస్
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలం పెద్ద నాగారం గ్రామానికి చెందిన మందుల నాగన్న అంధత్వం గల వ్యక్తి దీనస్థితి నీ గురించి స్థానిక ఎస్ ఐ గండ్రతి సతీష్ తెలుసుకుని,
ఎస్పి ఆదేశాలతో ఎస్సై తన సిబ్బందితో కలిసి పెద్ద నాగారం గ్రామానికి చేరుకుని వ్యక్తి దీనస్థితి నీ చూసి చలించి తక్షణ సహాయంగా కొన్ని నిత్యావసర వస్తువులను అందించడం తో పాటు బాధితుడికి ఉండటానికి ఇల్లు లేని విషయాన్ని ఎస్పీ దృష్టికి ఎస్ ఐ తీసుకెళ్లారు
స్పందించిన ఎస్పీ ఇంటి నీ నిర్మించి ఇచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు..
తన వంతుగా సహాయం చేయడం తోపాటు.. నర్సింహుల పేట స్టేషన్ సిబ్బంది,కొంత మంది దాతలను ముందుకొచ్చేల చేశారు..
ఎస్పీ సహాయ సహకారాలతో పాటు,
నలమాస రాజు, దాసరోజు రాజశేఖర్, జినకల రమేష్, యండి రఫీ, ఉల్లి శ్రీను, బొబ్బ సంజీవరెడ్డి, శ్రీరాం శేషయ్య, బానోతు భాస్కర్ దాతల సహకారంతో ఇంటి నిర్మానాన్ని పూర్తి చేసారు..
ఎస్పి స్వయంగా పెద్ద నాగారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులు చేస్తున్న గృహ ప్రవేశానికి హాజరయ్యి తమ సహకారం ఆ కుటుంబానికి ఏళ్ల వేళలా ఉంటుందని భరోసా కల్పించారు..
మానవీయ కోణంలో స్పందించి సహాయం అందించడంలో తోడ్పాటు ఇచ్చిన జిల్లా ఎస్పీకి బాధిత కుటుంబం,తోపాటు మండల, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో డిఎస్పీ సురేష్, సీఐ సంజీవ్, ఎస్సై గండ్రాతి సతీష్ పోలీసు సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


