(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 33వ రాజీవ్ గాంధీ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం దంతాలపల్లి ఎంపిటిసి నెమ్మది యాకన్న మాట్లాడుతూ,దేశం కోసం ,దేశ ప్రజలకోసం తృణప్రాయంగా ప్రాణాలు వదిలిన త్యాగధనులని , నవభారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని, కంప్యూటర్, టెలికాం విప్లవం ద్వారా దేశంలో ఐటీ రంగాన్ని గ్రామ గ్రామానికి టెలిఫోన్ సదుపాయం, పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందడానికి బాటలు వేశారన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుస్మిత రవీందర్ ,గ్రామ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు బొల్లు వీరన్న,మరియు సుతారపు అర్జున్ ,దర్శనాల సాయి , పులుగుజ్జ ప్రశాంత్, కొండ సాయి తదితర నాయకులు పాల్గొన్నారు.* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

