Type Here to Get Search Results !

రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు

 


నమస్తే మానుకోట న్యూస్


రేషన్ కార్డులు ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా దానిని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది


బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా ప్రభుత్వం ఈ-కేవైసీని తీసుకొచ్చి జనవరి 31లోగా లబ్ధిదారులు తమ వేలిముద్రలతో రేషన్ కార్డులను ధ్రువీకరించుకోవాలని కోరింది. గడవు సమీపిస్తున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. తెలంగాణలో ఇప్పటి వరకు 75.76 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో గడువును ఫిబ్రవరి నెలాఖరుకు పెంచారు. ఆలోగా వందశాతం ఈ-కేవైసీని పూర్తిచేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ను ఆదేశించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.