కమనీయం..రమణీయం
కపిల గిరి లక్ష్మీనరసింహుల కళ్యాణ మహోత్సవం
నర్సింహులపేట, మే 01 (నమస్తే న్యూస్)
కపిల గిరి పర్వతంపై వెలసిన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని కపిలగిరిలో శుక్రవారం రాత్రి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ సేవాసమితి ఆధ్వర్యంలో నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.ఇలాంటి కళ్యాణ మహోత్సవాలు హిందూ సంప్రదాయంలో విశేష ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇవి దేవుని వివాహాన్ని సూచిస్తూ,సర్వలోక మంగళం కోసం నిర్వహించబడతాయి. అర్చకులు శ్రీ కుమార చార్యులు ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణలు, హారతులు, భజనలు జరుగుతూ ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య, మండల అధ్యక్షులు జినుకల రమేష్, ఏరా నాగి కిషోర్, బండి రమేష్, ప్రేమ్ కుమార్, దాసు రోజు శేషు, యాకుబ్ రెడ్డి, నరేష్, వీరు నాయక్, యోగానంద సేవా సమితి నిర్వాహకులు,నాయకులు భక్తులు, తదితరులు పాల్గొన్నారు.




