బాల వికాస ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు.
(నమస్తే న్యూస్,నర్సింహులపేట, ఏప్రిల్ 03)
బాల వికాస సేవలు,ప్రజలకు మరింత చేరువకావాలని గ్రామ ఉపసర్పంచ్ నవీన్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా బాలవికాస ఆధ్వర్యంలో శుక్రవారం పడమటిగూడెం గ్రామంలో దాతలు సర్పంచి జక్కుల ఉప్పలయ్య, దాస రోజు కనకాచారి సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య తో కలిసి ఉపసర్పంచ్ చిమ్ముల నవీన్ వార్డ్ సభ్యులు మంచాల శ్రీశైలం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులకు బాటసారులకు దాహార్తిని తీర్చాలని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడం ఎంతో గొప్పదని అన్నారు .చలివేంద్రాన్ని ఏర్పాటుకు సహకరించిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, ఎస్కే మైబు, నూకల హరీష్ ,ఎస్ కే బాబు, విలేజి లీడర్స్ నాగలక్ష్మి ,ఎస్కే చాంద్ బీ ,గ్రూప్ లీడర్స్ యాకంత , జానకమ్మ, నాగమణి ,భద్రమ్మ, ఎస్కే ఫర్హాద్, సూరమ్మ, అనంత , యాకమ్మ బాలవికాస ప్రతినిధులు స్వర్ణలత, గుగ్గిళ్ళ స్వరూప రాణి, గ్రూపు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

