ఎమ్మెల్యే కు రాఖీ కట్టిన చిన్నారులు.
మరిపెడ, ఆగస్టు 25, (నమస్తే న్యూస్ డెస్క్)
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు…. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు…..పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు.అనంతరం రాఖీ పండుగను పురస్కరించుకుని చిన్నారులు ఎమ్మెల్యే రామచంద్రనాయక్కు రాఖీలు కట్టారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే వారికి మిఠాయిలు తినిపించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


