గార్ల రజాలి బేగ్ దర్గా వద్ద గంధం, దీపారాధన ఉర్సు ఉత్సవాలు
రిపోర్టర్, పిల్లలు నరసింహారావు
బయ్యారం, ఆగస్టు 01 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని సమీపంలో ఉన్న దర్గా వద్ద ప్రతి సంవత్సరం జరిగే వార్షిక ఊర్స్ ఉత్సవాలు ఈనెల 5, 6 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు.కమిటీ అధ్యక్షులు ఎండి. రహీం ఖాన్ మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 5వ తేదీన గంధం కార్యక్రమం, 6వ తేదీన దీపారాధన మహోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు., ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్గా ప్రత్యేక ఆశీస్సులు పొందాలని కోరారు.

