Type Here to Get Search Results !

ఏజెన్సీ లోని భూ సమస్యలను పరిష్కరించాలి: ఆదివాసి సంక్షేమ పరిషత్

NAMASTHE NEWS 0

ఏజెన్సీ లోని భూ సమస్యలను పరిష్కరించాలి: ఆదివాసి సంక్షేమ పరిషత్. 



బయ్యారం,జూలై 26 (నమస్తే న్యూస్)

ఏజెన్సీ ప్రాంతంలోని భూ సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదివాసి సంక్షేమం పరిషత్ నాయకులు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ ఆదివారం సెక్రటేరియేట్  లో తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి ఏజెన్సీ ప్రాంతంలోని భూ సమస్యల పైన మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా నాయకులు  తాటి సుధాకర్ ,ఈసాల సురేష్ జాయింట్ సెక్రెటరీ ఆదివాసి సంక్షేమ పరిషత్, సూర్ణపాక రాకేష్, సనప సందీప్, ఆదివాసి సంక్షేమ పరిషత్ బయ్యారం మండల అధ్యక్షులు జేఏసీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System