రిపోర్టర్, పిల్లలు నరసింహారావు
సెంటర్, బయ్యారం .
బయ్యారం,జూలై 28 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం గ్రామపంచాయతీ మలి దశ తెలంగాణ ఉద్యమకారులు బయ్యారం మండల ఉద్యమకారుల ఫోరమ్ ఉపాధ్యక్షులు మీసాల వెంకటయ్య గారు యాక్సిడెంట్ జరిగి క్రింద పడి తలకు గాయం అయ్యి మృతి చెందగా వారి భౌతిక కాయాన్ని సందర్శించి వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇచ్చిన మహబూబాబాద్ జిల్లా మరియు బయ్యారం మండలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నాయకులు
ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి సోమారాపు వీరాస్వామి మహబూబాబాద్ జిల్లా ప్రధానకార్యదర్శి నాయిని శ్రీనివాస్ రెడ్డి, బయ్యారం మండలం TUF అధ్యక్షులు అడిదెల వీరబద్రం, బయ్యారం TUF ప్రధానకార్యదర్శి గుండగాని రామానాదం, గుండాల శ్రీనివాస్, సాంబయ్య, షేక్ దస్తగిరి,అల్లం వెంకన్న, అలవాళ సారయ్య, ఆవుల లింగయ్య, మాదిరెడ్డి అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

