ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి
:రాష్ట్ర అధ్యక్షులు బానోతు వీరు నాయక్.
రిపోర్టర్: పిల్లల: నరసింహారావు
సెంటర్: బయ్యారం.
బయ్యారం,జూలై 25(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఈ రోజు TS TTF రాష్ట్ర అధ్యక్షులు బానోతు వీరు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు,ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి జి లక్ష్మణరావు ఆధ్వర్యం తో పాల్గొని శిక్షణ లో మెళుకువలను గ్రహించి షెడ్యూల్ ఏరియాలోనీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించి వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే తీర్చాలని, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉన్న పండిట్, PET పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, PRC అమలు చేసి, పెండింగ్ DA లు విడుదల చేయాలని అన్నారు,ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల హామీలు చెప్పిన విధంగా CPS ను రద్దుచేసి పాత పెన్షన్(OPS) విధానాన్ని పునరుద్దించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మూడు బాలాజీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ బిచ్చా నాయక్, బోడ భాస్కర్, L. మోహన్,DS కిషన్, వెంకన్న, రాజా,మల్సూర్,అరుణ, లక్ష్మి,సరిత ,చిరంజీవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

