రూరల్ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన అంజలి.
(నమస్తే న్యూస్, మహబూబాబాద్, ఏప్రిల్ 01)
మహబూబాబాద్ జిల్లా పోలీసు విభాగంలో కీలక మార్పుల నేపథ్యంలో, మహబూబాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా సీఐ అంజలి ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ గారిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ గారు సీఐ అంజలికి సూచనలు చేసినట్లు తెలిసింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పని చేస్తూ, చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించినట్టు సమాచారం.
సీఐ అంజలి మాట్లాడుతూ, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో విధులు నిర్వర్తిస్తూ, ప్రజల విశ్వాసాన్ని సంపాదించేలా కృషి చేస్తానని తెలిపారు. రూరల్ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని ఆమె స్పష్టం చేశారు.


