సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ
రామన్నపేట సెప్టెంబర్ 7(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో రావినారాయణరెడ్డి 35వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ మాట్లాడుతూ, భారతదేశమంతా స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న నిజాం ను ఎదిరించడానికి గొరిల్లా యుద్ధమే చేయాల్సిన పరిస్థితి కమ్యూనిస్టులకు వచ్చిందని దానికి నాయకులుగా రావినారాయణ రెడ్డి ముందుండి కత్తులు, గొడ్డల్లు, పారలు, చేతికి దొరికిన ఆయుధాలతో నిజాం సర్కారు పై, రజాకారులపై దండెత్తి తెలంగాణ విమోచనం కలిగించారని , 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో నల్లగొండ ఎంపీ గా నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి తో పార్లమెంటు ఓపెనింగ్ చేయించారని, నేడు కొందరు ఆయన చరిత్రను , కమ్యూనిస్టుల తాగాలను మరుగున పరిచేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, చరిత్ర ఎప్పటికీ నిజాలే చెప్తుందని గుర్తుంచుకోవాలని తెలియజేశారు,ఈ సందర్భంగా రావినారాయణ రెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, నివాళులు అర్పించిన వారిలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, ఏఐటియుసి మండల కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, సిపిఐ సీనియర్ నాయకులు గంగాపురం యాదయ్య, ఊట్కూరు శీను, ఎర్ర కిరణ్ కుమార్ గౌడ్, ఊట్కూరు కృష్ణ, పల్లె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

