ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్.
రామన్నపేట, ఆగస్టు 01 (నమస్తే న్యూస్)యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, గర్భిణీలు ప్రసవం అయిన అర్ధగంట లోపే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించడం ఎంతో శ్రేష్ఠమైనవి, జీవితకాలం ఆరోగ్యావంతంగా ఉండేందుకు ధోహధపడతాయాని గర్భిణీ లను ఉద్దేశిస్తూ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు సి పి డి ఓ, వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి నరేందర్, సూపర్ వైజర్ సుజాత ,పోషణ అభియాన్ అశోక్, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

