మరిపెడ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీర రెడ్డిని పరామర్శించిన
ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రునాయక్.
కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.
మరిపెడ, ఆగస్టు 5(నమస్తే న్యూస్).
ఇటీవల కాలు విరగడంతో చికిత్స పొందుతున్న మరిపెడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్లి రఘువీర్ రెడ్డిని బుధవారం హనుమకొండలోని ఆయన నివాసంలో ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ మర్యాదపూర్వకంగా పరామర్శించారు.ఈ సందర్భంగా రఘువీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రామచంద్ర నాయక్,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.పార్టీ కార్యకలాపాల్లో ఆయన సేవలు కొనసాగాలని అభిలషిస్తూ ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు,మండల అధ్యక్షులు,ఉప సర్పంచులు,వార్డు కౌన్సిలర్లు,జిల్లా నాయకులు,మండల నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

