నమస్తే న్యూస్ నర్సింహులపేట
వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ పోటీలు 04 – 01 – 26 నుంచి 11 – 01 -26 వరకు జరుగుతున్నాయి
తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ జట్టుకు నర్సింహులపేట మండలం జయపురం గ్రామ క్రీడాకారిణి చందు లావణ్య ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు రిటైర్మెంట్ వ్యాయామ ఉపాధ్యాయులు కోచ్ నెలకుర్తి వీరారెడ్డి తెలిపారు
చందు లావణ్యకు వంగాల చారిటబుల్ ట్రస్ట్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంగాల ప్రవీణ్ కుమార్ రెడ్డి, క్రీడాభిమానులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు

