అపూర్వమైన కానుకను అందుకున్న హైకోర్టు న్యాయవాది శ్రీనివాస్.
డోర్నకల్ /మరిపెడ(జులై 03)నమస్తే న్యూస్.భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి నుండి ఒక పుస్తకాన్ని అందుకోవడం నాకు ఎంతో గౌరవంగా ఉందని,జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా భావిస్తున్నాను.అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ అవకాశం లభించడం మరింత విశిష్టమైన విషయమని తెలంగాణ హైకోర్టు న్యాయవాది భూక్యా శ్రీనివాస్ అన్నారు.ఈ అపూర్వమైన కానుకకు, అలాగే అది అందించే స్ఫూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని నాకు కల్పించిన శ్రవణ్ మరియు దివాకర్ అన్నలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్ని తెలియజేశారు.

