Type Here to Get Search Results !

జర్నలిస్ట్ అకాల మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

  • జర్నలిస్ట్ గండమల్ల ఉపేందర్ అకాల మృతి.
  • కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు.
  • పాడే మోసిన ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పప్పుల శ్రీనివాసరావు.



తిరుమలాయపాలెం,జూన్ 26 (నమస్తే న్యూస్ )

మండల జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేసిన సీనియర్ పాత్రికేయుడు, టీయూడబ్ల్యూజే (ఐజేయు) తిరుమలాయపాలెం మండల ప్రెస్ క్లబ్ సభ్యుడు గండమల్ల ఉపేందర్ ఇక లేరనే వార్త స్థానిక పాత్రికేయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణంతో గండమల్ల ఉపేందర్ కుటుంబంలో  ఒక విషాద ఛాయలు అలముకున్నాయి.


కన్నీటి వీడ్కోలు పలికిన తోటి జర్నలిస్టులు:


ఉపేందర్ మరణవార్త తెలియగానే టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కమిటీ సభ్యులు, మండల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శుక్రవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, కన్నీటి నివాళులర్పించారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పప్పుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కూరపాటి విజయకుమార్, గోవింద సురేష్, ప్రచార కార్యదర్శి గుజ్జ రామకృష్ణతో పాటు పాత్రికేయ మిత్రులు ఎలిమల్ల శ్రీనివాస్, కామల్ల వీరయ్య, కొండా ఉపేందర్, నాగరాజు, కూరపాటి ఉపేందర్, మెట్టు రుద్రరాజు తదితరులు ఉపేందర్ పార్థివదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఆయనతో గడిపిన క్షణాలను, వృత్తిపరంగా ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ తోటి జర్నలిస్టులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎల్లప్పుడూ నవ్వుతూ, అందరితో స్నేహపూర్వకంగా ఉండే ఉపేందర్ అంత చిన్న వయసులోనే దూరమవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

అనాథలైన భార్యాపిల్లలు:

ఉపేందర్ మృతితో ఆయన కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి ఇక లేడనే విషయాన్ని తెలుసుకుని ఆ పిల్లలు ఏడుస్తున్న తీరు, భర్త భౌతికకాయంపై పడి భార్య రోదిస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. ఉపేందర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ఈ పుట్టెడు దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మండల పాత్రికేయ లోకం తమ సెంటిమెంట్‌ను చాటుకుంది.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.