Type Here to Get Search Results !

వరికొయ్యలకు అంటుకున్న చితిమంటలు..ఆందోళనకు గురైన రైతన్నలు..

దహన సంస్కారాల సమయంలో చెలరేగిన మంటలు.. వరి కొయ్యలకు వ్యాప్తి.

మంటలను ఆర్పుతున్న రైతులు.


నర్సింహులపేట, జూన్ 2 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో మంగళవారం దహన సంస్కారాల సందర్భంగా చెలరేగిన మంటలు సమీప వ్యవసాయ పొలాల్లో ఉన్న వరి కొయ్యలకు వ్యాపించాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.మంటలు వేగంగా వ్యాపిస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేపట్టారు. స్థానికులు సామూహికంగా స్పందించి మంటలు మరింత విస్తరించకుండా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.ఈ ఘటనలో ఎంత మేర నష్టం సంభవించిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గ్రామస్తుల అప్రమత్తతతో మంటలు ఇతర పొలాలకు వ్యాపించకుండా నియంత్రించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం  అధికారులు కూడా ఘటన పై సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.